ఢిల్లీ డిప్యూటీ సీఎంకి అస్సాం సీఎం కౌంటర్

ఢిల్లీ డిప్యూటీ సీఎంకి అస్సాం సీఎం కౌంటర్

PPE కిట్ల కాంట్రాక్టులో అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ భారీగా అక్రమాలు చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన అరోపణలపై హిమంత బిశ్వ శర్మ స్పందించారు. " దేశం మొత్తం 100 సంవత్సరాలలో అత్యంత భయంకరమైన మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో అస్సాంలో ఎటువంటి PPE కిట్‌లు లేవు. నా భార్య ధైర్యం చేసి ముందుకు వచ్చి విలువైన ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వానికి ఉచితంగా 1500 (కిట్‌లు) విరాళంగా ఇచ్చింది. ఆమె ఒక్క పైసా కూడా తీసుకోలేదు’’ అని ట్వీట్ లో సీఎం పేర్కొన్నాడు.

మనీష్ సిసోడియా అరోపణలు చేయడం మానేయాలని, లేకపోతే పరువు నష్టం ఎదుర్కొంటారని హెచ్చరించారు. అరోపణలు చేయడం కాదు వాటిని నిరూపించాలని అన్నారు. అంతకుముందు ఆరోగ్యమంత్రిగా ఉన్నప్పుడు  హిమంత విశ్వ శర్మ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తన భార్య కంపెనీకి,  కొడుకు వ్యాపారాల్లో భాగస్వాములకు అధిక ధరలకు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు.

ఇతర సంస్థల నుంచి 600 రూపాయలకు కొంటూ.. భార్య, కొడుకుకు చెందిన కంపెనీలకు ఒక్కో పీపీఈ కిట్ కు 990 రూపాయలు చెల్లించారన్నారు సిసోడియా. అయితే.. వాళ్లు పీపీఈ కిట్లు పూర్తిస్థాయిలో సప్లై చేయకుండా ఆ తర్వాత మళ్లీ కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపించారు.