ఢాకా: బంగ్లాదేశ్లో హిందువుల హత్యలు కొనసాగూతూనే ఉన్నాయి. మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుని స్థానిక ముస్లింలు దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా సునమ్ గంజ్ జిల్లాలో ఒక హిందూ యువకుడిని స్థానిక ముస్లిం దుండగుడు తీవ్రంగా కొట్టి విషం తాగించి హత్య చేశాడు. గురువారం ఈ ఘోరం జరిగింది. మృతుడిని జోయ్ మహాపాత్రోగా గుర్తించారు.
స్థానిక ముస్లిం యువకుడు అకారణంగానే మహాపాత్రోపై దాడిచేశాడని, బలవంతంగా విషం తాగించాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుడిని హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. కాగా.. మహాపాత్రో హత్యకు కొద్దిరోజుల కిందే భాండార్పూర్ గ్రామంలో 25 ఏండ్ల మిథున్ సర్కార్ ను కూడా దుండగులు చంపేశారు.
దొంగతనం నెపంతో కొట్టి చంపేందుకు యత్నించగా మిథున్.. తప్పించుకునేందుకు ఓ చెరువులో దూకి గల్లంతయ్యాడు. ఈ నెల 6న ఆయన మృతదేహాన్ని రికవరీ చేశారు.
