రాజీవ్ స్వగృహ టోకెన్ అమౌంట్ గడువు పెంపు

రాజీవ్ స్వగృహ టోకెన్ అమౌంట్ గడువు పెంపు

ఏప్రిల్​ 15వ తేదీ వరకు పెంచిన హెచ్​ఎండీఏ

హైదరాబాద్, వెలుగు :  బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ వేలానికి సంబంధించి టోకెన్ అమౌంట్ కట్టే గడువును హెచ్ఎండీఏ పొడిగించింది. ఈ నెల 25 వరకు గడువు ఉండగా.. దాన్ని వచ్చే నెల15వ తేదీ వరకు పెంచుతున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ప్రాంతాల్లో కలిపి 904 ఫ్లాట్లకు హెచ్ఎండీఏ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.  

వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 25 వ తేదీ వరకు గడువిచ్చింది. డబుల్ బెడ్ రూమ్-కి రూ.2 లక్షలు, సింగిల్-కు 1 లక్ష టోకెన్ అమౌంట్- చెల్లించాలని పేర్కొంది. అయితే, పబ్లిక్ నుంచి సరిగ్గా  రెస్పాన్స్ రాకపోవడంతో అఫీసర్లు ఇప్పుడు మళ్లీ టోకెన్ అమౌంట్ చెల్లింపు గడువును పెంచారు. ఈ ప్రక్రియ తరువాత లాటరీలు తీస్తారు. లాటరీలో ఫ్లాట్ రాకపోతే టోకెన్ అమౌంట్ తిరిగి చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఫ్లాట్ల వేలం ఇప్పటికీ 5 సార్లు జరగగా.. ఇంకా పూర్తి స్థాయిలో అమ్ముడుపోలేదు.