పండగ సీజన్ వచ్చిందంటే చాలు కార్ల కంపెనీలు రూ. లక్షల్లో డిస్కౌంట్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ఈ ఏడాది కూడా కస్టమర్ల కోసం ఇండియాలోని టాప్ కార్ల కంపెనీలు క్యాష్ బెనిఫిట్స్ను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ను అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉన్నాయి.. – బిజినెస్డెస్క్, వెలుగు
భారీ క్యాష్ డిస్కౌంట్లతో హ్యుండయ్..
హ్యుండయ్ ఇండియా తమ కార్లపై రూ. లక్ష వరకు డిస్కౌంట్లను ఇస్తోంది. శాంట్రోపై రూ. 15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ను, ఎలంట్రాపై రూ. 70 వేల వరకు డిస్కౌంట్ను ఇస్తోంది. గ్రాండ్ ఐ 10 పై రూ. 40 వేల వరకు, ఎలైట్ ఐ 20 పై రూ. 50 వేల వరకు డిస్కౌంట్ను ఇస్తోంది. క్యాష్ డిస్కౌంట్లతో పాటు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఆకర్షిస్తున్న మహింద్రా..
మహింద్రా అండ్ మహింద్రా తమ కార్లపై రూ. 3.06 లక్షల వరకు బెనిఫిట్స్ను ఆఫర్ చేస్తోంది. మహింద్రా ఎక్స్యూవీ500 పై రూ. 20 వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ను ఇస్తోంది. ఎక్స్యూవీ 300 పై రూ. 10 వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ను, బొలెరోపై రూ. 20,550 వరకు బెనిఫిట్స్ను ఆఫర్ చేస్తోంది. కేయూవీ 100 నెక్స్ట్పై రూ. 33,055 వరకు క్యాష్ ఆఫర్స్ను ఇస్తోంది. ఆల్ట్రస్ జీ4పై రూ. 2.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్స్ను ఇస్తోంది. స్కార్పియో మోడల్పై రూ. 20 వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ను, రూ. 25 వేల వరకు ఎక్చ్సేంజ్ బోనస్లను ఆఫర్ చేస్తోంది. క్యాష్ బెనిఫిట్స్తో పాటు కార్పొరేట్ బోనస్లు వంటివి కూడా ఇస్తోంది.కంపెనీ మోడల్ బొలెరో పికప్ కొన్నవారికి కరోనా ఇన్సూరెన్స్ను కూడా మహింద్రా అండ్ మహింద్రా ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. ఈ ఇన్సూరెన్స్ కింద రూ. లక్ష వరకు కవర్ చేస్తారు. బొలెరో పికప్ రేంజ్లోని పికప్ మ్యాక్సీ ట్రక్, సిటీ పికప్, కాంపెర్ వంటి వెహికల్స్ కొన్నవారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
మారుతి సుజుకీ నుంచి పండగ ఆఫర్లు..
కంపెనీ మోడల్స్పై వివిధ డిస్కౌంట్లను మారుతి సుజుకీ ఆఫర్ చేస్తోంది. ఆల్టోపై రూ. 21 వేల వరకు క్యాష్ డిస్కౌంట్లను ఇస్తుండగా, సెలెరియోపై 28 వేల వరకు ఆఫర్ చేస్తోంది. విటారా బ్రెజ్జాపై రూ. 20 వేలు, స్విఫ్ట్పై రూ. 15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్లను ఇస్తోంది. ఈ మోడల్స్పై క్యాష్ డిస్కౌంట్లతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్సెంజ్ బోనస్ వంటి అదనపు బెనిఫిట్స్ను కూడా కస్టమర్లకు అందిస్తోంది.
హోండాపై 2.50 లక్షల వరకు..
హోండా కార్స్ ఇండియా తమ కార్లపై రూ. 2.50 లక్షల విలువైన ఆఫర్లను ఇస్తోంది. క్యాష్ డిస్కౌంట్లు, వారెంటీని పెంచడం, మెయింటెనెన్స్ ప్రోగ్రామ్స్ను ఆఫర్ చేయడం వంటివి చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. అమెజ్, సిటీ 5 వ జనరేషన్, జాజ్జ్, డబ్యూఆర్వీ, సివిక్ మోడల్స్పై ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. సివిక్పై గరిష్టంగా రూ. 2.50 లక్షల బెనిఫిట్స్ను, సిటీ 5 వ జనరేషన్పై రూ. 30 వేల వరకు బెనిఫిట్స్ను ఆఫర్ చేస్తోంది.