
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన మల్టీమీడియా ప్రొడక్షన్ హౌస్ హార్న్బిల్ స్టూడియోస్... స్విట్జర్లాండ్కు చెందిన ఫూ ఎంటర్టైన్మెంట్ ఏజీతో చేతులు కలిపింది. హైదరాబాద్లో బుధవారం రెండు కంపెనీలు అవగాహనా ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలు చేశాయి. ఫూ తీయబోయే సిరీస్లకు మల్టీమీడియా, ప్రొడక్షన్ పార్టనర్గా హార్న్బిల్ పనిచేస్తుంది. ఈ సందర్భంగా హార్న్బిల్ స్టూడియోస్ సీఈవో శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ " హైదరాబాద్ ప్రొడక్షన్ హౌస్లో సిబ్బంది సంఖ్యను ప్రస్తుతం ఉన్న 100 నుండి 200 వరకు పెంచుతాం. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినోద & మల్టీమీడియా సంస్థల అవసరాలను తీర్చటం పై స్టూడియో దృష్టి సారిస్తుంది”అని చెప్పారు.