
- ఎక్కడికక్కడే నిలిచిన బోట్లు
సోమశిల (నాగర్కర్నూల్), వెలుగు : కృష్ణా తీరం వెంట భారీగా పెరిగిన గుర్రపు డెక్కతో ఆ ప్రాంతమంతా పార్క్ను తలపిస్తోంది. కొల్లాపూర్ మండలంలోని సోమశిల, అమరగిరి పెంట్లవెల్లి మండలంలోని మంచాల కట్ట, మల్లేశ్వరం తీర ప్రాంతాలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయాయి.
కనుచూపుమేరంతా పచ్చదనం పరుచుకోవడంతో పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తోంది. మరో వైపు భారీగా పెరిగిన గుర్రపు డెక్క కారణంగా పడవలు, బోట్లు నడిపే అవకాశం లేకుండా పోయింది. టూరిజం బోట్లు సైతం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.