వరలక్ష్మీ వ్రతం నైవేద్యం : అల్లం గారెలు 

వరలక్ష్మీ వ్రతం నైవేద్యం  :  అల్లం గారెలు 

శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి శుక్రవారం తలంటు స్నానాలు, కొత్త బట్టలు, పూజలు, ప్రసాదాలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు చేసే వరలక్ష్మీ వ్రతం రోజున అయితే ఇంట్లో ఆడవాళ్లు చేసే హడావిడి చెప్పక్కర్లేదు. పొద్దున్నే మహాలక్ష్మీలా తయారై పండుగ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేస్తారు. అందులో భాగంగా లక్ష్మీదేవికి ఎంతో రుచికరమైన నైవేద్యాలు వండి పెడతారు. నిజానికి పండుగ రోజు నైవేద్యాలు అన్న పేరే గానీ, ఇంత రుచికరమైన ఫుడ్​ని ఎప్పుడు చేసినా కాదంటారా! మరింకెందుకాలస్యం ఈసారి వ్రతానికి వీటిని తప్పకుండా ట్రై చేయండి. వాటిని ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. కచ్చితంగా తినాలనిపిస్తుంది. 

కావాల్సినవి :

మినపప్పు (నానబెట్టిన) – ఒకటిన్నర కప్పు

బియ్యం (నానబెట్టిన) – 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు – సరిపడా

కరివేపాకు(తరిగి) – కొంచెం

పచ్చిమిర్చి (తరిగి), మిరియాల పొడి – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

ఇంగువ – చిటికెడు

అల్లం తురుము – 11/2 టేబుల్ స్పూన్

తయారీ : మిక్సీజార్​లో నానబెట్టిన మినపప్పు, బియ్యం, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత పిండిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. అందులో ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, ఇంగువ, అల్లం తురుము వేసి కలిపి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత కవర్​ మీద నెయ్యి రాసి, పిండి వేసి గారెలా చేయాలి. గారెల్ని వేడి నూనెలో వేసి రెండు వైపులా కాల్చాలి.