కిచెన్ తెలంగాణ : మిల్లెట్ పాప్సికిల్స్

కిచెన్ తెలంగాణ : మిల్లెట్ పాప్సికిల్స్

మిల్లెట్ పాప్సికిల్స్

కావాల్సినవి :

కొర్రలు (ఉడికించి), చాకొలెట్ చిప్స్ – ఒక్కో కప్పు 

పాలు – ఒక లీటర్

పీనట్ బటర్ – అర కప్పు

తేనె, పల్లీలు (వేగించి) – ఒక్కోటి పావు కప్పు

వెనీలా ఎసెన్స్, కొబ్బరి నూనె – ఒక్కో టీస్పూన్

తయారీ : పాలు కాగబెట్టి అందులో ఉడికించిన కొర్రలు వేసి కలపాలి. తర్వాత పీనట్​ బటర్, తేనె వేసి కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. వెనీలా ఎసెన్స్, వేగించిన పల్లీలు కూడా ఆ మిశ్రమంలో వేసి కలపాలి. చల్లారాక పేపర్​ గ్లాస్​లో పోసి అల్యూమినియం ఫాయిల్​ పేపర్​తో మూసేయాలి. తర్వాత ఆ పేపర్​ పై నుంచి ఐస్​ పుల్లలు గుచ్చాలి. వాటన్నింటినీ ప్లేట్​లో పెట్టి ఫ్రిజ్​లో పెట్టాలి. ఎనిమిది గంటల తర్వాత అల్యూమినియం పేపర్, పేపర్​ గ్లాస్​ తీసేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో చాకొలెట్ చిప్స్, నూనె వేడిచేయాలి. చిప్స్ కరిగాక పాప్సికిల్స్​ని అందులో ముంచి వేగించిన పల్లీల్లో దొర్లించాలి. చూడటానికి యమ్మీగా ఉండే ఈ మిల్లెట్ పాప్సికిల్స్ తింటే చాలా టేస్టీగా ఉంటాయి.