యాదాద్రిలో సర్వ దర్శనానికి 2 గంటలు

యాదాద్రిలో సర్వ దర్శనానికి 2 గంటలు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం, వరుస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు క్యూకట్టారు. ఆలయ పరిసరాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు, దర్శన క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వ దర్శనానికి 2గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.

భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవదేవుడిని దర్శించుకున్న భక్తజనులు ఆర్జిత సేవత్సోవాల్లో కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వీవీఐపీ దర్శన క్యూలైన్లు రద్దీగా మారింది.