
- నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఘటన
కోడేరు, వెలుగు : ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యపై దాడి చేయడంతో ఆమె చనిపోయింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, ఎస్సై వి. సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల నాగశేషి, ఎల్లమ్మకు 25 ఏండ్ల కింద వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక కూతురు ఉన్నారు.
ఎల్లమ్మ స్వగ్రామమైన వనపర్తి జిల్లా పానుగల్ మండలం శాగపూర్లో గురువారం ఒడిబియ్యం పోసుకొని గంట్రావుపల్లికి తిరిగి వచ్చారు. నాగశేషి రాత్రి మద్యం తాగి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఆలస్యం ఎందుకు అయిందని ఎల్లమ్మ అడగడంతో గొడవకు దిగాడు.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నాగశేషి ఎల్లమ్మపై దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మృతురాలి అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కొల్లాపూర్ సీఐ మహేశ్ ఘటనాస్థలాని చేరుకొని వివరాలు సేకరించారు.