హైబ్రిడ్ పథకాలకు హై డిమాండ్​ ...జూన్ క్వార్టర్​లో రూ. 14వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్లు

హైబ్రిడ్ పథకాలకు హై డిమాండ్​ ...జూన్ క్వార్టర్​లో రూ. 14వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్లు

న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇన్వెస్టర్లను తెగ ఆకర్షిస్తున్నాయి.  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ. 14వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్​మెంట్లు ఈ ఫండ్స్‌‌‌‌లోకి  వచ్చాయి.  2022 ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో హైబ్రిడ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రూ. 10,084 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో వచ్చిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) వెల్లడించింది. ఈ క్వార్టర్​లో హైబ్రిడ్ ఫండ్స్, ఇటువంటి పథకాల  ఫోలియో సంఖ్యల అసెట్ బేస్ పెరిగింది. హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్ పథకాలు. ఇవి సాధారణంగా ఈక్విటీ , డెట్ సెక్యూరిటీల కలయికతో ఉంటాయి.  కొన్నిసార్లు బంగారం వంటి ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మధ్యస్త లేదా తక్కువ- రిస్క్ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉంటాయి కాబట్టి పెట్టుబడిదారులను మరింతగా ఆకర్షిస్తాయి. వీటిలో కొంత మొత్తం ఈక్విటీల్లో ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఎక్కువగా ఉండవు. ఈ ఏడాది మార్చి క్వార్టర్​లో రూ. 7,420 కోట్లు, డిసెంబర్ క్వార్టర్​లో రూ. 7,041 కోట్లు, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 14,436 కోట్లు రావడంతో ఈ ఏడాది జూన్ క్వార్టర్​లో హైబ్రిడ్ ఫండ్ల విలువ రూ. 14,021 కోట్లకు చేరింది. 2021 డిసెంబరులో ముగిసిన నాలుగు క్వార్టర్​లో, ఇటువంటి పథకాలు రూ. 20,422 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోను ఆకర్షించాయి. క్లయింట్ అసోసియేట్స్ కో–ఫౌండర్​ హిమాన్షు కోహ్లి మాట్లాడుతూ పన్నుల రేట్లు తక్కువగా ఉండటం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో విపరీతంగా రావడానికి కారణమని చెప్పారు. పెట్టుబడిదారులు తమ కేటాయింపులను డెట్ మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు తగ్గించి, హైబ్రిడ్ ఫండ్లకు పెంచుతున్నారని వివరించారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ వార్షిక రాబడులు 7 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 

డెట్​ ఫండ్స్​పై  పన్నుభారం

డెట్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పన్ను విధించడంలో ఇన్వెస్టర్లు తమ స్థిర ఆదాయంలో కొంత భాగాన్ని హైబ్రిడ్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారని మార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్ ఇండియా డైరెక్టర్ - మేనేజర్ రీసెర్చ్ కౌస్తుభ్ బేలాపుర్కర్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, మూడు సంవత్సరాలకు పైగా ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఇకపై ఇండెక్సేషన్ ప్రయోజనాలు ఉండవు.  తాజా క్వార్టర్​లో రూ.14వేల కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో మొత్తంలో 98 శాతం లేదా రూ.13,721 కోట్లు ఆర్బిట్రేజ్ ఫండ్ల నుంచి వచ్చాయి. ఆర్బిట్రేజ్ వర్గంలో ప్రధానంగా సంస్థాగత పెట్టుబడిదారుల ఆధిపత్యం కనిపిస్తుంది . ఈ వర్గంలో గణనీయమైన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోలు,  అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోలు సాధారణం.   ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయ ఆర్బిట్రేజ్ స్ప్రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కారణంగా, ఈ కేటగిరీ నుంచి హైబ్రిడ్ ఫండ్స్​కు పెట్టుబడులు  అత్యధికంగా ఉన్నాయని ఎడెల్వీస్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సీఈఓ రాధికా గుప్తా తెలిపారు. హైబ్రిడ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో వల్ల జూన్ 2023 చివరి నాటికి అసెట్ బేస్ 11 శాతం కంటే ఎక్కువ పెరిగి రూ. 5.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరంలో రూ.4.71 లక్షల కోట్లుగా ఉంది. జూన్ క్వార్టర్​లో హైబ్రిడ్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫోలియో సంఖ్యలు 4.6 లక్షలు పెరిగి 1.22 కోట్లకు చేరుకున్నాయి. అటువంటి పథకాలకు ఆదరణ పెరిగిందనడానికి ఈ సంఖ్యలే రుజువు.