ఎంబీబీఎస్ చదవకుండానే ఆపరేషన్లు చేస్తున్నరు

ఎంబీబీఎస్ చదవకుండానే ఆపరేషన్లు చేస్తున్నరు
  •  హయత్​నగర్, కుంట్లూరులోని 5 హాస్పిటళ్లలో టీజీఎంసీ తనిఖీలు

ఎల్బీనగర్, వెలుగు: ఎంబీబీఎస్​చదవలేదు.. కానీ ఆ స్థాయి వైద్య సేవలందిస్తూ ప్రజలను మోసం చేస్తున్నరు.. నిందితుల్లో ముగ్గురిపై కేసు నమోదవగా మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. హయత్​నగర్​సీఐ నాగరాజుగౌడ్​, టీజీఎంసీ వైస్​చైర్మన్​డాక్టర్​గుండగాని శ్రీనివాస్​తెలిపిన వివరాల ప్రకారం.. వరుస ఫిర్యాదులు వస్తుండడంతో టీజీఎంసీ బృందం గురువారం హయత్​నగర్, కుంట్లూరు పరిధిలోని పలు క్లినిక్​లు, ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించింది. కుంట్లూరులో సన్​రేస్​హాస్పిటల్, డయాగ్నోస్టిక్​సెంటర్​లో డాక్టర్​ఉమాకాంత్ బీఏఎంఎస్ చదివి, అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. 

హయత్​నగర్​లో శ్రీ విజయ బ్రహ్మేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో విశ్వనాథుల రాఘవాచారి, హనుమాన్​ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఇంటర్​చదివిన వనం వినోద్ కుమార్​డాక్టర్లుగా చెప్పుకుంటూ ఎంబీబీఎస్​డాక్టర్​చేసే వైద్యం చేస్తున్నట్లు తేల్చారు. శ్రీసాయి పాలీ క్లినిక్ లో డాక్టర్​ కేఎస్.ప్రసాద్ బీహెచ్ఎంఎస్ చదివి, ఎంబీబీఎస్ గా ప్రచారం చేసుకుంటూ, బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో కొంపల్లి రాంబాబు అనే వ్యక్తి ట్రీట్​మెంట్​చేస్తున్నట్లు గుర్తించారు. 

వీరు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారని టీజీఎంసీ వైస్​చైర్మన్ పేర్కొన్నారు. డాక్టర్​ఉమాకాంత్, డాక్టర్​కేఎస్.ప్రసాద్ కు నోటీసులు ఇచ్చామన్నారు. రాంబాబు, రాఘవాచారి, వినోద్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుంట్లూరు రోడ్​లో కొంతమంది క్లినిక్​లు, ఆస్పత్రులు మూసివేసి పారిపోయారన్నారు. త్వరలో మరోసారి తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 500 కేసులు నమోదయ్యాయని చెప్పారు. నకిలీ వైద్యుల వివరాలనుantiquackerytsmc@onlinetsmc.in కు తెలియజేయాలని కోరారు. డాక్టర్​కేయూఎన్.విష్ణు, విజిలెన్స్​ఆఫీసర్​రాకేశ్​
తదితరులున్నారు.