హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 120/1.. రంజీ ట్రోఫీ ప్లేట్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో శుభారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 120/1.. రంజీ ట్రోఫీ ప్లేట్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో  శుభారంభం
  •     మిజోరాం 199 ఆలౌట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  రంజీ ట్రోఫీ ప్లేట్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు శుభారంభం లభించింది. మిజోరాంతో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 26 ఓవర్లలో 120/1 స్కోరు చేసింది.

తన్మయ్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ (6) విఫలమైనా, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (81 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), రోహిత్‌‌‌‌‌‌‌‌ రాయుడు (25 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) నిలకడగా ఆడుతున్నారు. అంతకుముందు టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన మిజోరాం తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 56 ఓవర్లలో 199 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. కేసీ కరియప్ప (45) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో రోహిత్‌‌‌‌‌‌‌‌ రాయుడు 4, కార్తికేయ 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఇంకా 79 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది.