- నీటి సంరక్షణ, సరఫరాలో అత్యుత్తమ ఫలితాలకు ప్రకటన
- రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న బోర్డు ఎండీ అశోక్రెడ్డి
హైదరాబాద్సిటీ, వెలుగు: నీటి సంరక్షణ, సరఫరాలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు మెట్రోవాటర్బోర్డుకు కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టాప్ మున్సిపల్కార్పొరేషన్ కేటగిరీలో ఈ అవార్డు ప్రకటించారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి ఈ అవార్డుతో పాటు రూ.2 కోట్ల ప్రోత్సాహకం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోర్డు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఈ అవార్డు వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బోర్డు అధికారులపై నమ్మకం ఉంచి ప్రోత్సహించడం, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో తాము విజయవంతంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
