హైదరాబాద్: హీరో సిద్ధార్థ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విట్టర్లో అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టాడంటూ ఓ మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 67 యాక్ట్ ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారత్ స్టార్ షట్లర సైనా నెహ్వాల్ ను ఉద్దేశించి హీరో సిద్దార్థ్ చేసిన కామెంట్లపై విమర్శలు రావడంతో స్పందించి సైనాకు క్షమాపణ చెప్పారు. సైనా నెహ్వాల్ ట్వీట్ కు స్పందనగా నేనో అసభ్యకరమైన జోక్ చేశాను..నేను స్పందించిన తీరు.. వాడిన భాష బాగా లేదు.. దానికి గాను క్షమాపణలు కోరుతున్నా.. మీరెప్పుడూ నా చాంపియనే.. నిజాయితీతో సిద్దార్థ్ అంటూ ట్వీట్ చేయడంతో వివాదం సద్దుమణిగినట్లేనని భావించారు. అయితే ఇంతో మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేయడంతో వివాదానికి ఫుట్ స్టాప్ పడలేదని తెలుస్తోంది.