
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న సమా ఏంజెల్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఐదో రోజు, ఆదివారం జరిగిన క్వాలిఫయర్ రౌండ్ గేమ్స్లో సమా అత్యధికంగా170 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచి నాకౌట్ బెర్తు కైవసం చేసుకుంది. సమా గోల్ఫర్స్ మధుకర్, అభిజయ్, రామ్ మొత్తం 30 పాయింట్లు రాబట్టి టీమ్ను అగ్రస్థానంలో నిలిపారు.
టోర్నీ ఆరంభం నుంచి సమా టీమ్ అద్భుతమైన ఆటతో పాటు నిలకడ చూపెడుతోంది. ప్రతీ గేమ్కు తమ ఆటతీరును మెరుగు పరుచుకుంటూ ముందుకెళ్తున్న ఏంజెల్స్ గ్రూప్–ఎలో టాప్ ప్లేస్, ఓవరాల్ లీగ్లో రెండో ప్లేస్లో నిలిచింది. టేబుల్లో ఎనిమిదో ప్లేస్లో నిలిచిన టీమ్తో వచ్చే ఆదివారం వూటీ గోల్ఫ్ కోర్స్లో జరిగే క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది.
మహిళలే ఓనర్లుగాఈ లీగ్లో మహిళలే ఓనర్లు, కెప్టెన్గా ఉన్న జట్టు సమా ఏంజెల్స్ కావడం విశేషం. సరోజ గడ్డం, మాధవి ఉప్పలపాటి టీమ్కు ఓనర్లుగా వ్యవహరిస్తూ లీగ్లోనూ పోటీ పడుతున్నారు. నేహా అహ్లువాలియా కెప్టెన్గా ఉన్న జట్టులో మధుకర్ పేరాల, అభిజయ్ జైస్వాల్, వేణు, సోమ్ దేవ్, రవీంద్ర, రాజ్, సాలిల్ మూర్తి, రామ్ మాండవ ఆడుతున్నారు.