
హైదరాబాద్సిటీ, వెలుగు: సిటీలో మెట్రోవాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటి పైప్లైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్న 49 మందిపై విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రెడ్హిల్స్ హైలెవెల్ సెక్షన్లోని బజార్ ఘాట్లో మిరాజ్ అండ్ ఇరామ్ ఫార్చూన్ అపార్ట్మెంట్లో అఖీత్తో పాటు 47 మంది అధికారుల అనుమతి లేకుండా 20 ఎంఎం నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. విజిలెన్స్ అధికారులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.
దీంతో యజమాని సహా అపార్ట్మెంట్లోని 48 మందిపై నాంపల్లి పీఎస్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాగే హిందీ నగర్ సెక్షన్ పరిధిలోని అగాపురాలో (ఇంటి నం. 5-6-99) ఓ భవనంలో రెండు 20 ఎంఎం అక్రమ నీటి కనెక్షన్లను అధికారులు గుర్తించారు. ఈ భవన యజమాని సలావుద్దీన్పై హబీబ్నగర్ పీఎస్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. అక్రమ కనెక్షన్ల గురించి సమాచారం ఉంటే వాటర్ బోర్డు విజిలెన్స్ సెల్ నంబర్ 99899 98100కు సమాచారం ఇవ్వాలని కోరారు.