కమీషన్ల ఆశ చూపి 3.5 లక్షలు లాగేసిన స్కామర్లు

కమీషన్ల ఆశ చూపి 3.5 లక్షలు లాగేసిన స్కామర్లు

బషీర్​బాగ్​, వెలుగు: ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తే మంచి కమీషన్​ వస్తుందని నమ్మించి ఓ యువకుడిని ఆన్​లైన్​ స్కామర్లు నిండా ముంచారు. బేగంపేటకు చెందిన 27 ఏళ్ల యువకుడికి గోయిబిబో ఇండియా ప్రమోషన్స్ డిపార్ట్​మెంట్ ప్రతినిధులుగా టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా కాల్ చేశారు. హోటల్స్ కు గూగుల్ ద్వారా రేటింగ్స్ ఇస్తే కమీషన్​ ఇస్తామన్నారు. మొదట రెండు సార్లు రూ.970, రూ.17,109 కమీషన్  చెల్లించారు. 

యువకుడిని ఓ గ్రూపులో చేర్చి ఇన్వెస్ట్​ చేసిన వారికి అధిక లాభాలు వచ్చినట్లు స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేశారు. దీంతో స్కామర్లను నమ్మిన యువకుడు పలు దఫాలుగా రూ.3 లక్షల 50 వేల వరకు ఇన్వెస్ట్​మెంట్​ చేశాడు. ఆ తరువాత స్కామ్​ అని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం హెల్స్​లైన్ నెంబర్  ద్వారా కంప్లయింట్​ ఇచ్చాడు.