
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్(ఎంఈటీ) 24 గంటలు పని చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. వాతావరణ హెచ్చరికలను పరిశీలించి సిద్ధంగా ఉంండాలన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్కాంట్రాక్టర్లతో పాటు హైడ్రా మార్షల్స్, డీఆర్ ఎఫ్ మేనేజర్లు, సూపర్వైజర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలు సమస్యల్లో ఉంటే పరిధిలు గీసుకొని ఉండాల్సిన పని లేదని, పక్క సర్కిల్లో సమస్య ఉన్నా అందరూ కలిసి పని చేయాలన్నారు.