
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాశమైలారం ప్రమాద స్థలంలో హైడ్రా డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ డీఆర్ఎఫ్ టీమ్స్ని అక్కడకు పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో కలిసి సహాయక చర్యలు కొనసాగించారు.
సోమవారం ఉదయం మొదలైన సహాయక కార్యక్రమాలు మంగళవారం కూడా కొనసాగాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. షిఫ్ట్కు 55 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో మొత్తంగా 165 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.