భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానం నుంచి రెండు ఇంధన ట్యాంకులు వేరయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని BKT ప్రాంతంలో ఉన్న ఘాజీపూర్ గ్రామ పొలాల్లో పడిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా ఇంధన ట్యాంకులు కూలిపోవడంతో పెద్ద శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Also Read :- ప్రయాణికులకు గుడ్ న్యూస్
ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్యాంక్ను వాహనంలో లోడ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంధన ట్యాంకుల శిథిలాలు పొలంలో పడడంతో ఎవరికీ ఎటువంటి నష్టం గానీ, హాని గానీ కలగలేదు. అయితే, విమానం నుంచి ఇంధన ట్యాంకులు ఎలా విడిపోయాయనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంధన ట్యాంకులు పడిపోవడానికి కారణమైన ఖచ్చితమైన పరిస్థితులను తెలుసుకోవడానికి అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
#Lucknow#लखनऊ में उड़ान भर रहे एयरफोर्स के विमान से दो फ्यूल टैंक #गाजीपुर गाँव मे ज़मीन पर गिरे
— Goldy Srivastav (@GoldySrivastav) October 25, 2023
BKT #एयरफ़ोर्स स्टेशन को सूचित किया #अफ़सर जांच में जुटे, #वायुसेना ने फ्यूल टैंक को लिया कब्जे में#AirForce #Fuletenk pic.twitter.com/27KnZ4ZKph