దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఎప్పుడూ సిద్ధమే

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఎప్పుడూ సిద్ధమే

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 88వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్‌‌లో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చైనాతో సరిహధ్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సత్వరంగా స్పందించిన ఎయిర్ వారియర్స్‌‌ను ఆయన మెచ్చుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అవసరమైన సేవలను ఐఏఎఫ్ అందించిందని గుర్తు చేశారు.