దేశ ర‌క్ష‌ణ‌కు ఎప్పుడూ సిద్దంగానే ఉన్నాం: ఎయిర్ చీఫ్ మార్షల్ RKS భదౌరియా

దేశ ర‌క్ష‌ణ‌కు ఎప్పుడూ సిద్దంగానే ఉన్నాం: ఎయిర్ చీఫ్ మార్షల్ RKS భదౌరియా

దేశ రక్షణ కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 88వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్‌‌లో పాల్గొన్న ఆయన.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చైనాతో సరిహధ్దుల్లో ఉద్రిక్తతల క్రమంలో వెంటనే అలర్టైన ఎయిర్ వారియర్స్‌‌ను ఆయన మెచ్చుకున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అవసరమైన సేవలను ఐఏఎఫ్ అందించిందని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా సుఖోయ్ యుద్ధ విమానాల‌తో క‌ల‌సి ర‌ఫెల్ జెట్ ఫైట‌ర్స్ చేసిన విన్యాసాలు అంద‌ర్ని అబ్బుర ప‌రిచాయి.

ఎయిర్ ఫోర్స్ 88వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల‌ సందర్భంగా ఇండియన్ ఎయిర్ వారియర్స్‌‌కు ప్రముఖులు విషెస్ చెప్పారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అభినందనలు తెలిపారు.