World Cup 2023: ఇండియా - పాక్ మ్యాచ్ టికెట్ లక్ష రూపాయలా!

World Cup 2023: ఇండియా - పాక్ మ్యాచ్ టికెట్ లక్ష రూపాయలా!

క్రికెట్ అభిమానులకు పిడుగు లాంటి వార్త ఇది. వస్తున్న నివేదికలను బట్టి.. వరల్డ్ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 14న దాయాది దేశాల(ఇండియా vs  పాకిస్తాన్) మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు కనిష్టంగా రూ. 2వేలు మొదలు గరిష్టంగా లక్ష రూపాయల మధ్య ఉండనున్నాయట. ఈ లెక్కన కుటుంబంతో కలిసి లగ్జరీగా మ్యాచ్ చూడాలంటే లక్షలు వెచ్చించాల్సిందే.

ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ రేట్లు(అంచనా)

బ్లాక్‌లు:

  • K,L,P & Q - రూ.2,000
  • J & R - రూ.2,500
  • B, C, F & G - రూ. 3,500
  • M & N - రూ.4,000
  • A & H - రూ.4,500
  • D & E - రూ.6,000
  • సౌత్ ప్రీమియం ఈస్ట్ మరియు వెస్ట్ - రూ.10,000
  • ప్రెసిడెంట్ గ్యాలరీ - రూ. 25,000
  • ప్రెసిడెంట్ సూట్ L5 మరియు రిలయన్స్ బాక్స్‌లు - రూ. 75,000
  • ప్రెసిడెంట్ సూట్ L4 - రూ. 1,00,000

ఆగ‌స్టు 25 నుంచి టికెట్ల అమ్మ‌కాలు

వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల టికెట్ల అమ్మ‌కాలు ఆగ‌స్టు 25వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే ఇండియా మ్యాచ్ ల టికెట్లు మాత్రం దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ టికెట్ల అమ్మకాలు ఆగ‌స్టు 30 నుంచి మొదలుకానుండగా.. ప్రధాన మ్యాచ్ ల టికెట్ల అమ్మ‌కాలు ఆగ‌స్టు 31 నుంచి స్టార్ట్ అవుతాయి. హైవోల్టేజ్ ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు సెప్టెంబ‌ర్ 3వ తేదీన అమ్మ‌నున్నారు. అలాగే సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్‌కు చెందిన టికెట్ల‌ను సెప్టెంబ‌ర్ 15న అమ్మ‌నున్నారు. టికెట్లు కావాల‌నుకునే వాళ్లు https://www.cricketworldcup.com/register ఈ వెబ్‌సైట్‌లో ఆగ‌స్టు 15వ తేదీ నుంచి రిజిస్ట‌ర్ చేసుకోవాలి. 

లక్షా 32వేల మందికి అవకాశం

అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా- పాక్ మ్యాచ్ జరగనుంది. దీని సామర్థ్యం లక్ష మంది కాగా, హైవోల్టేజ్ దృష్ట్యా దానిని లక్షా 32వేలకు పెంచినట్లు తెలుస్తోంది.