
వన్డే వరల్డ్ కప్లో రెండు ప్రాక్టీస్, మూడు మెయిన్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న ఉప్పల్ స్టేడియాన్ని 20 మంది ప్రతినిధులతో కూడిన ఐసీసీ ప్యానెల్ సోమవారం పరిశీలించింది. గ్రూపులుగా విడిపోయిన ప్రతినిధులు సుమారు మూడు గంటల పాటు స్టేడియాన్ని చుట్టి మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించారు. స్టేడియంలోని సౌకర్యాలపై ముఖ్యంగా విశాలమైన లాంజ్లు, డ్రెస్సింగ్ రూమ్లపై వాళ్లు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏవైనా మార్పులు అవసరం అయితే ఆ విషయాన్ని ఐసీసీ ప్యానెల్ వారంలోగా హెచ్సీఏకు తెలపనుంది.