దుబాయ్: ఇండియా స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ.. ఐసీసీ విమెన్స్ టీ20 ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన బౌలర్ల జాబితాలో దీప్తి (718) ఒక స్థానం ఎగబాకి సంయుక్తంగా రెండో ర్యాంక్లో నిలిచింది. సాదియా ఇక్బాల్ (718) కూడా రెండో ర్యాంక్లో కొనసాగుతున్నది. పేసర్ రేణుకా సింగ్ (701) పదో ర్యాంక్లో ఉంది. సోఫీ ఎకిల్ స్టోన్ (777) టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా, సారా గ్లెన్ (712) నాలుగో ర్యాంక్లో ఉంది.
సౌతాఫ్రికా స్పిన్నర్ మలాబా (712) మూడు ర్యాంక్లు దిగజారి ఐదో ర్యాంక్కు పరిమితమైంది. ఆల్రౌండర్స్ లిస్ట్లో దీప్తి శర్మ నాలుగో ర్యాంక్లోనే కొనసాగుతోంది. బ్యాటింగ్లో మంధాన 4వ ర్యాంక్లో, జెమీమా, షెఫాలీ, హర్మన్ వరుసగా 13, 16, 17వ ర్యాంక్ల్లో ఉన్నారు.