హైదరాబాద్: చార్జిషీట్లే వేయాల్సి వస్తే బీజేపీ సర్కార్ మీద 132 కోట్ల చార్జిషీట్లు వేయాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి అంశంపై విరుచుకుపడుతూ.. ఆయా ప్రాంతాల్లో చేసిన ప్రసంగాల్లోని అంశాలపై సవివరంగా ప్రకటన విడుదల చేశారు.
* తమను గెలిపిస్తే దేశ ప్రజల అకౌంట్లో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వేస్తానన్నది బీజేపీ సర్కార్
* సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల చొప్పున 12 కోట్ల ఉద్యోగాలు ఏమయినై ? ఈ మాట తప్పినందుకు దేశ యువత మీపై వేయాలి చార్జీషీట్
* బీజేపీ నాయకులు సిగ్గులేకుండా, నీతిమాలిన విమర్శలు చేస్తున్నారు
* జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తీరు పట్ల విరుచుకుపడ్డ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగరం రూపు రేఖలు మార్చేలా అభివృద్ది చేసినందుకా మాపై చార్జీషీట్…. కిషన్ రెడ్డి రెండేళ్లలో ఒక్క రూపాయి అయినా అదనంగా తెచ్చిండా అని ప్రశ్నించారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎందుకు ఛార్జ్ షీట్లు వేస్తారో చెప్పాలన్నారు. హైదరాబాద్ నగరంలో కరెంటు కష్టాలు తీర్చినందుకా ? అన్నపూర్ణతో రూ.5కే ప్రజల కడుపులు నింపుతున్నందుకా ? బస్తీ దవాఖానాలతో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నందుకా ? గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు పెట్టినందుకా ? ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చినందుకా ? పెట్టుబడులు వస్తున్నందుకా ? శాంతి భద్రతలను కాపాడుతున్నందుకా ? పేదింటి పెండ్లికి కళ్యాణ లక్ష్మి తో అండగా నిలబడుతున్నందుకా సమాధానం చెప్పాలని నిలదీశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ నగరంలో కేసీఆర్ ప్రభుత్వంలో కల్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్, రెసిడెన్షియల్ స్కూళ్ళు, వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసుకుంటున్నాం. ఇలాంటి పథకాలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా అని కేటీఆర్ అన్నారు. అంతేకాదు ఓట్ల కోసం భాద్యత రాహిత్యంగా యువతను పెడదోవ పట్టించే విధంగా బీజేపీ నాయకుల తీరు ఉందంటూ దుయ్యబట్టారు. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనాల ప్రయాణించినా ఫరవాలేదు, తాగి బండి నడిపినా ఫరవాలేదు, మమ్మల్ని గెలిపిస్తే చలాన్లు అన్నీ మేమే కడతాం అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి బీజేపీ నాయకులు చేస్తున్న కుట్రలను గమనించాలన్నారు. నగరంలో ఎక్కడా గుడులే లేనట్లు ఛార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లాలని చూడటం హిందూ -ముస్లింల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడమే అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఈ ఆరేళ్లలో అనేక రంగాల్లో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. లాక్ డౌన్ లో ప్రజలను కాపాడుకుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. నిన్న మొన్నటి వరదల్లో ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు మోకాల్లోతు నీళ్లలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు భరోసా ఇచ్చింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. వరదల్లో ఇబ్బందుకు ఎదుర్కొన్న నగర ప్రజలకు అర్హులైన ప్రతీ కుటుంబానికి 10 వేల చొప్పున వరద సాయం చేసుకుంటూ వెళ్తుంటే ఎన్నికల కమీషన్ కు లెటర్ రాసి ప్రజల నోటికాడి ముద్ద లాగేసింది ఎవరో ప్రజలకు తెలుసనన్నారు. 25వేలు ఇస్తామంటున్న బిజెపికి వరద భాధితులు జాబితా అందిస్తామని, కేంద్రం నుంచి వేంటనే ఈ మేరకు అర్ధిక సహాయం అందించి మాట్లాడాలన్నారు.
నగరంలో గత ఆరేళ్లుగా గుడుంబా గబ్బు లేదు, పేకాట క్లబ్బు లేదు, శాంతి భద్రతలకు ఢోఖా లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీనితో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఎవరి పాలనలో హైదరాబాద్ పచ్చగా ఉంటుందో, ఎవరికీ ఓటేస్తే తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయో ప్రజలు ఆలోచించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ మద్దతును తెలియజేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.
for More NEWS
కల్వకుంట్ల కుంటుంబ పాలన అంతం కాబోతోంది
కేటీఆర్ సీఎం కొడుకైతే ఏంటి.. పాతబస్తీలో పాదయాత్ర చేయాలంటే ఎంఐఎం పర్మిషన్ ఉండాల్సిందే
టీఆర్ఎస్ ఫేక్ న్యూస్ ప్రచారానికి దిగడం.. ఓటమిని ఒప్పుకున్నట్లే
V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు
జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే దమ్ముందా..?
వీడియో: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలతో రోడ్డు మీదే..