భార్య లేదా గర్ల్​ ఫ్రెండ్ ఉంటేనే ఆ రెస్టారెంట్‎లోకి ఎంట్రీ.!

భార్య లేదా గర్ల్​ ఫ్రెండ్ ఉంటేనే ఆ రెస్టారెంట్‎లోకి ఎంట్రీ.!

రెస్టారెంట్, హోటల్ లేదా కేఫ్​​​కి వెళ్లాలంటే చేతిలో డబ్బుంటే  సరిపోతుంది. కానీ,  జైపూర్​​లోని ఈ రెస్టారెంట్​కి వెళ్లాలంటే మాత్రం డబ్బుతో పాటు పక్కన గర్ల్​ ఫ్రెండ్​ లేదంటే భార్య ఉండాల్సిందే. ఒకవేళ ఎవరూ లేదంటే మొహమాటం లేకుండా గేటు బయట నుంచే గెట్​ అవుట్​ అనేస్తాడు సెక్యూరిటీ గార్డ్​. ఈ రెస్టారెంట్​ రూల్స్​ అలాంటివి మరి. టైంతో పాటు ట్రెండ్స్​ కూడా మారుతున్నాయి. ప్రజెంట్​ ట్రెండ్స్​​కి తగ్గట్టే కస్టమర్స్​ని అట్రాక్ట్​ చేయడానికి డిఫరెంట్​గా ఆలోచిస్తున్నాయి రెస్టారెంట్​లు, హోటల్స్​. అలా ఈ మధ్య  జైపూర్​లోని ఓ రెస్టారెంట్ కూడా కొంచెం వెరైటీగా ఆలోచించింది. ‘మా రెస్టారెంట్​లో మగవాళ్లు తినాలంటే ఆడవాళ్లని వెంటబెట్టుకుని రావాల్సిందే’ అనే రూల్​ పెట్టింది. ఇదే విషయాన్ని రెస్టారెంట్​ గోడలతో పాటు ఏసీపైనా రాసి మరీ చెబుతోంది. దాన్ని ఫొటో తీసి హర్షిత శర్మ అనే మహిళ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ‘నా​ ఫ్రెండ్​ నన్ను ఎందుకు ఈ రెస్టారెంట్​కి తీసుకెళ్లాడో అర్థమయ్యింద’ని ఆ ఫొటో కింద ఫన్నీ క్యాప్షన్​ పెట్టింది. అంతే... కొద్ది నిమిషాల్లోనే ఈ ట్వీట్​ తెగ వైరల్​ అయింది. వేలల్లో లైక్స్​ కూడా వచ్చాయి. చాలామంది దీన్ని రీ ట్వీట్​ చేస్తున్నారు. పోటీలు పడి మరీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఒకరైతే ఏకంగా ఈ రెస్టారెంట్ వెతికి పట్టుకుని దీని పేరు ‘గోపీ భోజనాలయం’ అని ట్విట్టర్​లో దండోరా వేశారు. ఇంకొందరు తమ ఏరియాలో ఉన్న ఇలాంటి స్పెషల్​ రెస్టారెంట్​ల గురించి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రెస్టారెంట్​కి మాత్రం ఫ్రీగా ఫుల్​ పబ్లిసిటీ దొరికింది. కానీ, లేడీస్​ ఉంటేనే ఎంట్రీ ఏంటన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. రెస్టారెంట్​ వాళ్లు కూడా ఏం చెప్పలేదు.

మరిన్ని వార్తల కోసం: 

జైలులో కొడుకును కలిసిన షారూఖ్

దేశాధినేతలు ఇచ్చిన గిఫ్టులను పాక్ ప్రధాని అమ్ముకుంటున్నారా?

​​​​​​సీఎం అని కూడా చూడకుండా తిడుతున్నరు: వైఎస్ జగన్