నర్సింహులపేట, వెలుగు : ఓ కూల్ డ్రింక్ షాపులో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఆదివారం రాత్రి జరిగింది. మండల కేంద్రంలోని శ్రీనివాస వైన్స్ పక్కన ఉన్న కూల్ డ్రింక్ షాపులో మద్యాన్ని నిల్వ చేసినట్లు గుర్తు తెలియని వ్యక్తులు సీ విజిల్ యాప్లో కంప్లైంట్ చేశారు.
దీంతో స్పందించిన స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆదివారం రాత్రి దాడి చేసి రూ. 40 వేల విలువైన మద్యం పట్టుకున్నారు. మద్యాన్ని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేస్తామని ఫ్లయింగ్ టీమ్ మెంబర్స్ చెప్పారు.