
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) షాక్ఇచ్చింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కింద 1 బిలియన్ డాలర్ల నిధులను (దాదాపు 8,540 కోట్లు) మంజూరు చేసిన ఐఎంఎఫ్.. వీటి విడుదలకు 11 షరతులు విధించింది. భారత్తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాకిస్తాన్కే ఎక్కువ సమస్యలు వస్తాయని హెచ్చరించింది. పొరుగు దేశంతో ఘర్షణలు దేశంలో ఆర్థిక, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని తెలిపింది.
భారత్– పాకిస్తాన్మధ్య ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్ మొదట నష్టాల్లోకి వెళ్లినా.. ప్రస్తుతం స్టెబుల్గా ఉన్నాయని పేర్కొన్నది. కాగా, పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి డిఫెన్స్బడ్జెట్ను రూ.2.414 ట్రిలియన్గా ప్రణాళిక వేస్తున్నది. ఇది నిరుడితో పోలిస్తే రూ.252 బిలియన్లు అంటే 12% అధికం. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్ కొత్త షరతులు విధించినట్టు తెలుస్తున్నది. ఈ 11తో కలిసి పాక్పై ఐఎంఎఫ్ విధించిన కండిషన్స్సంఖ్య 50కి చేరింది.
ఐఎంఎఫ్ తాజాకండిషన్స్ఇవే..
ఈ జూన్లోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా 2026 బడ్జెట్ను పాకిస్తాన్పార్లమెంట్ ఆమోదించాలి. జూన్ లోపు 4 రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని ఐఎంఎఫ్సూచించింది. 2026 ఫిబ్రవరి 15 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఈ మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది. ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ను ప్రచురించాలి.
2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్లాన్రూపొందించాలి. ఈ నెలాఖరు నాటికి క్యాప్టివ్ పవర్ లెవీ ఆర్డినెన్స్ను శాశ్వతంగా మార్చడానికి పార్లమెంటు చట్టాన్ని కూడా ఆమోదించాలని ఐఎంఎఫ్ తెలిపింది. పరిశ్రమలను జాతీయ విద్యుత్ గ్రిడ్కి మార్చేలా ప్రభుత్వం ఖర్చును పెంచిందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని సూచించింది. 2035 నాటికి స్పెషల్ టెక్నాలజీ జోన్స్, ఇండస్ట్రియల్ పార్కులకు ఇచ్చే సబ్సిడీలను పూర్తిగా తొలగించాలని సూచించింది.
జులై చివరి నాటికి వినియోగించిన మోటారు వాహనాల వాణిజ్య దిగుమతిపై ఉన్న అన్ని పరిమితులను ఎత్తివేయడానికి అవసరమైన చట్టాలను పార్లమెంట్కు సమర్పించాలని కోరింది. ఐఎంఎఫ్ విధించిన కొత్త కండిషన్స్తో పాక్లో టెన్షన్ మొదలైంది. పాకిస్తాన్కు విడుదల చేసే ప్రతి రూపాయి టెర్రర్ ఫండింగే అంటూ భారత్ ఇటీవల వ్యాఖ్యానించింది. ఆ దేశానికి నిధులు విడుదలపై ఓసారి
పునరాలోచన చేయాలని ఐఎంఎఫ్ను కోరింది.