కుక్కల దాడిలో చిన్నారి మృతి

కుక్కల దాడిలో చిన్నారి మృతి

హైదరాబాద్, వెలుగు: వీధి కుక్కల దాడిలో ఆరేండ్ల బాలిక చనిపోయింది. చెంగిచెర్ల సుశీల టౌన్ షిన్​లో ఉంటున్న అమృత కవిత, వలీ కూతురు బేబీ(6). శనివారం ఇంటి బయట ఆడుకుంటున్న బేబీపై 5 కుక్కలు దాడి చేసి, తీవ్రంగా కరిచాయి. పాప కేకలతో బయటకి వచ్చిన తల్లిదండ్రులు కుక్కలను తరిమి బేబీని స్థానిక హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అటునుంచి అంకుర హాస్పిటల్​కు, కండీషన్​ సీరియస్​గా ఉండడంతో యశోదకు, అక్కడి నుంచి నిలోఫర్​కు తరలించారు. ట్రీట్​మెంట్​ స్టార్ట్​ చేసిన కొద్దిసేపటికే బాలిక చనిపోయింది. వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని పలుమార్లు కంప్లయింట్​ చేసినా బోడుప్పల్​ మున్సిపల్ ​కార్పొరేషన్​ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..