అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ 50-–28 తేడాతో టైటాన్స్ను చిత్తు చేసి లీగ్లో శుభారంభం చేసింది. ఆ టీమ్ రైడర్ సచిన్ 14 టచ్ పాయింట్లతో చెలరేగాడు.
మంజీత్ (8), అంకిత్ (5) కూడా రాణించారు. టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ 11 పాయింట్లతో మరోసారి సూపర్10 సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 57–27 తో హర్యానా స్టీలర్స్పై విజయం సాధించింది. గురువారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్ తో జైపూర్, గుజరాత్ జెయింట్స్ తో పాట్నా పైరేట్స్ పోటీ పడతాయి.