అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు..ప్రమాదంలో రిటైర్డ్​ టీచర్​ మృతి

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు..ప్రమాదంలో రిటైర్డ్​ టీచర్​ మృతి

ఖానాపూర్, వెలుగు: సంక్రాంతి పండగకు ఇంటికి వస్తున్న కొడుకును తీసుకెళ్లేందుకు వెళ్తూ.. కారు అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో రిటైర్డ్​ టీచర్​ చనిపోయారు. ఈ ఘటన దస్తురాబాద్ మండలంలో జరిగింది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ కోసం ఆదిలాబాద్​నుంచి ఇంటికి వస్తున్న తన కొడుకును ఇందన్​పల్లి నుంచి తీసుకొచ్చేందుకు మండలంలోని బూత్కూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎ.ప్రభాకర్(62) ఆదివారం ఉదయం తన కారులో బయల్దేరారు.

బూత్కూర్, మున్యాల్ గ్రామాల మధ్యలోని ఓ మూల మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ప్రభాకర్​ను జగిత్యాలలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు. బోగి పండుగ రోజున ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచి వేశాయి.