జనవరి-మార్చిలో  పెరిగిన హౌసింగ్​ సేల్స్

జనవరి-మార్చిలో  పెరిగిన హౌసింగ్​ సేల్స్
  •     ఏడు సిటీల్లో 1.13 లక్షల ఇండ్ల అమ్మకం: ఎనరాక్​ రిపోర్టు

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు టాప్​ సిటీలలో జనవరి– మార్చి క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు 1.13 లక్షలకు చేరినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్​ ఎనరాక్​ తన  రిపోర్టులో వెల్లడించింది. ఇండ్ల రేట్లు 6 నుంచి 9 శాతం పెరిగినా, డిమాండ్​ స్ట్రాంగ్​గా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమని తెలిపింది. దేశ రియాల్టీ సెక్టార్లో రెసిడెన్షియల్​  హౌసింగ్ ​ సెగ్మెంట్లో బుల్​ రన్​ కంటిన్యూ అవుతోందని పేర్కొంది. గత పదేళ్ల కాలానికి చూస్తే ఒక క్వార్టర్లో ఇంత ఎక్కువ అమ్మకాలు ఎప్పుడూ రికార్డవలేదని ఎనరాక్​ రిపోర్టు చెబుతోంది.

ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యలో ఇండ్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయని, అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో రెసిడెన్షియల్​ హౌసింగ్​ సేల్స్​ 99,550 యూనిట్లేనని పేర్కొంది. ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​–పుణెలు కలిపి మొత్తం అమ్మకాలలో 48 శాతాన్ని కంట్రిబ్యూట్​ చేశాయి. ఈ కేలండర్​ ఇయర్​ ఫస్ట్​ క్వార్టర్లో ఢిల్లీ–ఎన్​సీఆర్​ ఒక్కటే సేల్స్​లో తగ్గుదలను రికార్డు చేసింది. 

షార్ట్​ టర్మ్​లో  సవాళ్లుండొచ్చు..

షార్ట్​టర్మ్​లో హౌసింగ్​ సెక్టార్​కు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చని పురి హెచ్చరిస్తున్నారు. ఇన్​ఫ్లేషన్​ పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపుదల  వంటివి ఈ సవాళ్లకు కారణమవుతాయని ఆయన వివరించారు. దీంతో రాబోయే రెండు క్వార్టర్లలో హౌసింగ్​ మార్కెట్​ డిమాండ్​ కొంత తగ్గొచ్చని పురి పేర్కొన్నారు. ఎనరాక్​ డేటా ప్రకారం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్​లో రెసిడెన్షియల్​ హౌసింగ్​ సేల్స్​ ఈ ఏడాది మొదటి క్వార్టర్లో 19 శాతం పెరిగి 34,690 యూనిట్లకు చేరాయి. పుణెలో అమ్మకాలు ఏకంగా 42 శాతం ఎక్కువై 19,920 యూనిట్లయ్యాయి. ఢిల్లీ–ఎన్​సీఆర్​లో మాత్రం అమ్మకాలు 9 శాతం పడిపోయి 17,160 యూనిట్లకు పరిమితమయ్యాయి.

బెంగళూరులో రెసిడెన్షియల్​ ప్రాపర్టీల సేల్స్​ 16 శాతం పెరిగాయి. హైదరాబాద్​లోనూ రెసిడెన్షియల్​ ఇండ్ల అమ్మకాలు 9 శాతం పెరిగి 14,280 యూనిట్లకు చేరాయి. చెన్నైలో అమ్మకాలు 18 శాతం, కోల్​కతాలో 3 శాతం పెరిగాయి. ఏడు సిటీలలోనూ సగటున ఇండ్ల రేట్లు 6 నుంచి 9 శాతం పెరిగాయని ఎనరాక్​ డేటా వెల్లడిస్తోంది. కన్​స్ట్రక్షన్​ రా మెటీరియల్స్​ రేట్లు పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. దేశంలో రెసిడెన్షియల్​ హౌసింగ్​ డిమాండ్ పెరుగుదల​ రాబోయే కొన్నేళ్లలో కొనసాగుతోందని రియాల్టీ కంపెనీ సిగ్నేచర్​ గ్లోబల్​ చైర్మన్​ ప్రదీప్​ అగర్వాల్​  చెప్పారు.

రెసిడెన్షియల్​ హౌసింగ్​ డిమాండ్​ పెరుగుదల కొనసాగుతోంది. మొదటి క్వార్టర్లో పదేళ్లలో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ సేల్స్​ రికార్డయ్యాయి. ముఖ్యంగా రూ. 1.5 కోట్లకు మించిన విలువున్న ఇండ్ల అమ్మకాల జోరు ఎక్కువైంది. - అనూజ్​ పురి, ఎనరాక్​ చైర్మన్‌‌