యునికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రెడ్

యునికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రెడ్

న్యూఢిల్లీ :  ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ సంస్థ ఇన్​క్రెడ్ ​ కొత్త, ప్రస్తుత పెట్టుబడిదారుల నుంచి తాజాగా  60 మిలియన్ డాలర్లను సేకరించి యునికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టప్​గా ఎదిగింది.   కొత్తగా మూలధనం రాక వల్ల ఇన్​క్రెడ్​ విలువ 1.04 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది  ఈ సంవత్సరం యునికార్న్ హోదా పొందిన రెండవ కంపెనీగా అవతరించింది. సిరీస్ డీ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంఈఎంజీ  రంజన్ పాయ్ నాయకత్వం వహించారు.

 ఆయన  9 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టారు. ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చైర్మన్ రవి పిళ్లై,  డాయిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ గ్లోబల్ కో–-హెడ్   రామ్ నాయక్   వరుసగా  5.4 మిలియన్ డాలర్లు,  1.2 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు.  నిధుల సమీకరణలో అనేక మంది అల్ట్రా-హై-నెట్ వర్త్ వ్యక్తులు, ఫ్యామిలీ ఆఫీసులు, వరేనియం క్యాపిటల్ అడ్వైజర్స్,  సత్వ గ్రూప్ వంటి సంస్థాగత పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు. ఈ డబ్బుతో బ్యాలెన్స్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేస్తామని, వ్యాపారాన్ని విస్తరిస్తామని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రెడ్ సీఈఓ భూపిందర్ సింగ్ చెప్పారు. తాము కన్జూమర్​, స్టూడెంట్, ఎంఎస్​ఎంఈ లోన్లు ఇస్తామని చెప్పారు.