IND vs IRE 3rd T20I: గెలిస్తే చరిత్ర.. కనుమరుగు కానున్న పాకిస్తాన్ రికార్డు

IND vs IRE 3rd T20I: గెలిస్తే చరిత్ర.. కనుమరుగు కానున్న పాకిస్తాన్ రికార్డు

జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా మరో ప్రపంచ రికార్డు సొంతం చేసుకోవడానికి అడుగు దూరంలో ఉంది. ఐర్లాండ్ పర్యటనలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ చేజిక్కించుకున్న భారత జట్టు.. బుధవారం(ఆగస్టు 23) చివరి టీ20లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే బుమ్రా సేనకు..  వైట్‌వాష్ చేసే గొప్ప అవకాశం ఉంది. దీంతో దాయాది పాకిస్తాన్ జట్టు పేరిట ఉన్న ఒక రికార్డు కనుమరుగు కానుంది. ఆ రికార్డు ఏంటో చూసేద్దామా..!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఎనిమిది వైట్‌వాష్‌లు నమోదు చేసిన ఏకైక జట్టు పాకిస్థాన్ మాత్రమే. మూడో టీ20లో ఐర్లాండ్‌పై.. భారత్ గెలిస్తే ఆ రికార్డు కనుమరుగు కానుంది. ప్రస్తుతానికి ఎనిమిది వైట్‌వాష్‌లతో పాక్‌కు సమంగా ఉన్న భారత జట్టు.. ఈ విజయంతో వైట్‌వాష్‌ల సంఖ్య తొమ్మిదికి చేరుతుంది. దీంతో టీ20 ఫార్మాట్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక వైట్‌వాష్‌లను నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది.

టీమిండియా 8 వైట్‌వాష్‌లు ఏయే జట్టుపై అంటే.. 

  • ఆస్ట్రేలియాపై ఒకసారి 
  • శ్రీలంకపై రెండుసార్లు
  • వెస్టిండీస్ పై మూడుసార్లు
  • న్యూజిలాండ్ పై రెండుసార్లు

ప్రస్తుతానికి ఎనిమిది సిరీస్‌లతో ఇరు జట్లు(ఇండియా, పాకిస్తాన్) సమంగా ఉన్నాయి.