భారత్, సౌతాఫ్రికా టీ20 మ్యాచ్కు రెండు సార్లు అంతరాయం ఏర్పడింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలోకి పాము రావడంతో..అంపైర్లు కొద్దిసేపు మ్యాచ్ ను ఆపేశారు. గ్రౌండ్ సిబ్బంది పామును బయటకు పంపడంతో..తిరిగి ఆట ప్రారంభమైంది. ఆ తర్వాత సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ మ్యాచ్ కొద్దిసేపు ఆగింది. సౌతాఫ్రికా 2.1 ఓవర్లలో 5 పరుగులకు రెండు వికెట్ల కోల్పోయి దశలో ఒక ఫ్లడ్ లైట్స్ టవర్ పూర్తిగా నిలిచింది. దీంతో అంపైర్లు మ్యాచ్ను కొద్దిసేపు ఆపేశారు. అది సరి చేసే వరకు మ్యాచ్ నిలిచిపోయింది. ఆది సరిచేసే వరకు రెండు జట్ల ఆటగాళ్లు డగౌట్ కు వెళ్లిపోయారు. చివరకు ఫ్లడ్ లైట్స్ కు మరమ్మతులు పూర్తయ్యాక..మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.