వెస్టిండీస్ బ్యాటింగ్.. ఎలాంటి మార్పులు లేవన్న పాండ్యా

వెస్టిండీస్ బ్యాటింగ్.. ఎలాంటి మార్పులు లేవన్న పాండ్యా

ఇండియాతో జరుగుతోన్న నాల్గవ టెస్టులో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసి టీమిండియా  ముందు భారీ టార్గెట్ నిర్ధేశిస్తామన్న రోవ్‌మాన్ పావెల్.. భారత్ లాంటి పెద్ద జట్టుపై సిరీస్‌ గెలిచేందుకు ఇదొక మంచి అవకాశమని తెలిపాడు. ఇక భారత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా  మాట్లాడుతూ.. జట్టులో ఎలాంటి మార్పులు లేవని మూడో 20 జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు. 

తుది జట్లు:

ఇండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసిన్, ఒబెడ్ మెక్‌కాయ్.