కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాండ్యా.. మ్యాచ్‌ను ఏం చేస్తడో!

కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాండ్యా.. మ్యాచ్‌ను ఏం చేస్తడో!

వెస్టిండీస్‌తో జరుగుతోన్న ఆఖరి టీ20లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. కరేబియన్ జట్టు ఒక మార్పు చేసింది. నాలుగో టీ20కి దూరమైన ఆ జట్టు స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో వంటిది. విజయం సాధించిన జట్టు సిరీస్ సొంతం చేసుకోనుంది.

తుది జట్లు:

ఇండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసిన్, అల్జారీ జోసెఫ్.