శాఫ్‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌-17 విమెన్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ లో ఇండియా అమ్మాయిలకు మరో విజయం

శాఫ్‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌-17 విమెన్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ లో ఇండియా అమ్మాయిలకు మరో విజయం

థింఫు: సౌత్‌‌‌‌ ఏషియన్ ఫుట్‌‌‌‌బాల్ ఫెడరేషన్ (శాఫ్‌‌‌‌) అండర్‌‌‌‌‌‌‌‌-17 విమెన్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా అమ్మాయిల జట్టు జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా 2-–0తో  బంగ్లాదేశ్‌‌‌‌ను చిత్తు చేసింది. దాంతో ఆరు పాయింట్లతో తమ గ్రూప్‌‌‌‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పోరులో  ఇండియా అమ్మాయిలు ఆట ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టారు. డిఫెన్స్ బలంగా ఉండటంతో బంగ్లాకు కనీసం ఒక గోల్ చేయడానికి కూడా అవకాశాలు లభించలేదు. 

మ్యాచ్ 14వ నిమిషంలో పెర్ల్ ఫెర్నాండెజ్ అద్భుతమైన గోల్ చేసి ఇండియాకు 1-–-0 ఆధిక్యాన్ని ఇచ్చింది. మధ్యలో బంగ్లా గోల్ కోసం ప్రయత్నించినా ఇండియా గోల్ కీపర్ మున్నీ చాకచక్యంగా అడ్డుకుంది. సెకండాఫ్​లో కూడా ఇండియా ఆధిక్యంలోనే కొనసాగింది. 76వ నిమిషంలో సబ్‌‌‌‌స్టిట్యూట్ ప్లేయర్ బోనిఫిలియా షుల్లై కార్నర్ నుంచి వచ్చిన బాల్‌‌‌‌ను అద్భుత హెడర్‌‌‌‌గా మల్చడంతో ఇండియా లీడ్  డబులైంది. బంగ్లా ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్‌‌‌‌ కూడా కొట్టలేకపోయింది.