దేశం అతిపెద్ద డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది..మోదీ 11 ఏండ్ల పాలనలో ఇది సాధ్యమైంది: అమిత్షా

దేశం అతిపెద్ద డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది..మోదీ 11 ఏండ్ల పాలనలో ఇది సాధ్యమైంది: అమిత్షా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏండ్ల పాలనలో ఇండియా అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా అన్నారు. టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని, వ్యాపార రంగానికి టెక్నాలజీని జోడించి భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకానమీగా నిలిపారని కొనియాడారు. ఆరోగ్యం, విద్య, వస్తు, వాణిజ్యం ఇలా ప్రతి రంగాన్ని మోదీ డిజిటలైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారని అన్నారు.

డిజిటల్ విప్లవం ద్వారా ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని ప్రతి రం గాన్ని అభివృద్ధివైపు మల్లించారని మెచ్చుకున్నారు. జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఏడు జిల్లాలను కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే రైల్వే మల్టీ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజె క్టులను ఆమోదించడంపై మోదీకి అమిత్​షా కృతజ్ఞతలు తెలిపారు.