ఇస్తాంబుల్: విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇండియా బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ క్వార్టర్ఫైనల్ దూసుకెళ్లింది. ఆమెతో పాటు పర్వీన్, అనామిక కూడా క్వార్టర్స్ చేరి పతకం నెగ్గేందుకు మరొక్క విజయం దూరంలో నిలిచింది. ఆదివారం జరిగిన 52 కేజీ ప్రిక్వార్టర్స్ బౌట్లో నిఖత్ 5–‑0తో మంగోలియా బాక్సర్ లుసైఖన్ను చిత్తు చేసింది. బౌట్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన నిఖత్.. మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థి ముఖంపై పంచ్లు కొట్టింది. అద్భుతమైన ఫుట్వర్క్తో పాటు రింగ్లో వేగంగా కదిలిన హైదరాబాదీ బాక్సర్ ముందు లుసైఖన్ పూర్తిగా తేలిపోయింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో పర్వీన్ (63 కేజీ) 5–0తో సోఫియా జజారియ (అమెరికా)ను ఓడించగా, అనామిక (50 కేజీ) కూడా 5–0తో క్రిస్టీ లీ (ఆస్ట్రేలియా)పై నెగ్గింది. కానీ, 54 కేజీ ప్రిక్వార్టర్స్లో శిక్ష 2–3తో యెసుగెన్ (మగోలియా) చేతిలో పోరాడి ఓడింది.
మరిన్ని వార్తల కోసం...