రూ.1.30 లక్షల కోట్లతో.. భారత్​నెట్​ ప్రాజెక్ట్

రూ.1.30 లక్షల కోట్లతో.. భారత్​నెట్​ ప్రాజెక్ట్
  • ప్రపోజల్​కు కేంద్రం ఓకే

న్యూఢిల్లీ: దేశంలోని 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్​ కనెక్టివిటీ కోసం ప్రభుత్వం చేపట్టిన భారత్​నెట్​ ప్రాజెక్ట్  కోసం రూ.1.39 లక్షల కోట్లు కేటాయించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.   ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా రౌండ్లకు నిధులు ఇచ్చే ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. ప్రస్తుతం 1.94 లక్షల గ్రామాలకు ఈ ప్రాజెక్టు కింద నెట్​ కనెక్టివిటీ ఇచ్చారు.  వచ్చే 2.5 ఏళ్లలో మిగిలిన గ్రామాలకు నెట్​కనెక్టివిటీ రానుంది.  

దేశంలోని అన్ని గ్రామాలకు లాస్ట్​మైల్​ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత కనెక్టివిటీని అందించడానికి రూ.1,39,579 కోట్ల నిధులను ఇవ్వాలన్న ప్రపోజల్​ను కేబినెట్ ఆమోదించింది. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్ ప్రపంచంలోని అతిపెద్ద గ్రామీణ టెలికాం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఒకటి. దేశంలోని మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు లాస్ట్​మైల్​ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ కనెక్టివిటీ కోసం దీనిని దశలవారీగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదటిసారి అక్టోబర్ 2011లో క్యాబినెట్ ఆమోదం పొందింది. స్పెషల్​ పర్పస్  ​వెహికల్​(ఎస్​పీవీ​) గా భారత్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ (బీబీ​ఎన్​ఎల్​) ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. రెండోదశకు 2017లో ఆమోదం లభించింది.  రెండు దశల్లో ప్రాజెక్ట్ కోసం రూ.42,068 కోట్లు ఇచ్చారు. 

విలేజ్ ఎంటర్‌‌ప్రెనూర్లతో టై-అప్

ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే భారత్ సంచార్ నిగమ్ (బీఎస్​ఎన్​ఎల్​)  విభాగమైన బీబీ​ఎన్​ఎల్, కనెక్టివిటీని అందించడానికి విలేజ్​ లెవెల్​ ఎంట్రప్రెనూర్లతో (వీఎల్​ఈలు) కలసి పనిచేస్తుంది. “పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత స్థానిక ఎంట్రప్రెనూర్ల సహాయంతో ఫైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇంటికి తీసుకెళ్లే నమూనాను ఖరారు చేశాం. నాలుగు జిల్లాల్లోని గ్రామాలను నెట్​ద్వారా అనుసంధానం చేసేందుకు మొదట పైలట్ ప్రాజెక్ట్​ను నిర్వహించాం.  తరువాత ఇది చాలా రాష్ట్రాల్లోని 60వేల గ్రామాలకు విస్తరించింది. 

ఆశించిన ఫలితాలు వచ్చాయి ”అని మరో అధికారి తెలిపారు. మొత్తం 3.51 లక్షల బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాండ్ కనెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించామని, ఈ పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు 3,800 మంది ఎంట్రపెనూర్లు పాల్గొన్నారని అధికారి తెలిపారు.  ప్రతి ఇంటికి సగటు డేటా వినియోగం నెలకు 175 గిగా బైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వరకు నమోదయింది. బీబీ​ఎన్​ఎల్,​  వీఎల్ఈ​ల మధ్య 50 శాతం రాబడి వాటా విధానంలో(రెవెన్యూ షేర్​) ఈ ప్రాజెక్ట్​ను రూపొందించారు. నెలవారీ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.399 నుంచి ప్రారంభమవుతుంది. 30ఎంబీపీఎస్​ వేగం గల ప్లాన్​కు నెలకు రూ.799 వరకు కట్టాలి. దేశంలో 37 లక్షల రూట్ కిలోమీటర్ల (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కెఎమ్) ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సి) ఏర్పాటు కాగా, వీటిలో బీబీఎన్ఎల్ 7.7 లక్షల ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేఎమ్ ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిని ఏర్పాటు చేసింది.