ప్రేగ్ : ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞా నంద తన తోటి ఆటగాడు విదిత్ సంతోష్ను ఓడించాడు. ప్రేగ్ మాస్టర్స్ టోర్నమెం ట్లో భాగంగా ఆదివారం జరిగిన ఐదో రౌండ్లో ప్రజ్ఞా 52 ఎత్తుల్లో విదిత్కు చెక్ పెట్టాడు. మరో యంగ్స్టర్ డి. గుకేశ్ గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన డేవిడ్ నవారతో తలపడ్డ గుకేశ్ 61 ఎత్తుల తర్వాత పరాజయం పాల య్యాడు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞా, గుకేశ్ చెరో రెండున్నర పాయింట్లతో 4,5వ స్థానాల్లో నిలవగా, సంతోష్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే టోర్నీలో చాలెంజర్ ఈవెంట్లో ఆర్. వైశాలి ఐదో రౌండ్లో హోలాండ్కు చెందిన ఎర్విన్ లామి చేతిలో ఓడిపోయింది.