ఆపరేషన్​ సిందూర్​పై అమెరికాకు వారం ముందే సమాచారం

ఆపరేషన్​ సిందూర్​పై అమెరికాకు వారం ముందే సమాచారం
  • అమెరికా విదేశాంగ మంత్రికి ఫోన్​లో చెప్పిన జైశంకర్​ 

న్యూ ఢిల్లీ: పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్​లోని ఉగ్రస్థావరాలపై తాము దాడి చేస్తామని ‘ఆపరేషన్ ​సిందూర్’ చేపట్టే వారం ముందే అమెరికాకు భారత్​ తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ ఫోన్​లో తెలియజేశారు.

మేం పాకిస్తాన్​లోని టెర్రరిస్టులను నాశనం చేస్తాం. ఇందులో సందేహమే లేదు” అని రూబియోతో జైశంకర్ పేర్కొన్నట్టు మీడియా వర్గాలు తెలిపాయి. కాగా, ఈ నెల 7న భారత్​ ‘ఆపరేషన్​ సిందూర్’​ను చేపట్టింది. పాకిస్తాన్, పాక్​ ఆక్రమిత కాశ్మీర్​​లోని 9 టెర్రరిస్ట్​ స్థావరాలను ధ్వంసం చేసింది.