డబ్ల్యూటీసీలో ఇండియాకు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డబ్ల్యూటీసీలో ఇండియాకు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెనక్కునెట్టి  టీమిండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఓడిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రస్థానం కోల్పోయింది. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3–1తో ఆధిక్యంలో ఉన్న ఇండియా ప్రస్తుతం 64.58 పాయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సెంటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పీటీసీ)తో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. న్యూజిలాండ్ 60.00 పీటీసీతో రెండో స్థానానికి పడిపోయింది. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్టుకు ముందు కివీస్ 75 పీటీసీతో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఆస్ట్రేలియా (59.09 పీటీసీ) మూడో స్థానంలో ఉంది. కాగా,  ఇండియా ధర్మశాల వేదికగా ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  ఐదో టెస్టులో పోటీ పడనుంది.