– నేవీ చరిత్రలో భారీ డీల్.. ఈఓఐ జారీ
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 75(ఐ)లో భాగంగా ఆరు అత్యాధునిక డీజిల్– ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల తయారీకి సంబంధించి నేవీ కీలక ముందడుగు వేసింది. రూ.45వేల కోట్ల వ్యయంతో విదేశీ సంస్థలతో కలిసి చేపట్టబోయే మెగా ప్రాజెక్టులో భాగస్వామి కావాలనుకునే దేశీ కంపెనీలను ఆహ్వానిస్తూ గురువారం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్(ఈఓఐ) జారీ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కార్పియన్ శ్రేణి సబ్మెరైన్లకు అదనంగా కొత్తవాటిని నిర్మిస్తారు. బిడ్ ద్వారా ఎంపికయ్యే కంపెనీ.. ఇండియన్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా వ్యవహరిస్తూ, టెక్నాలజీని అందించే విదేశీ సంస్థతో కలిసి పనిచేస్తుంది. నిర్మాణ పనులన్నీ స్థానికంగానే చేపడతారు. వచ్చే ఐదేండ్లలో ఆరు సబ్మెరైన్ల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంటుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విధానంలో నేవీ చేపడుతున్న రెండో అతి పెద్ద ప్రాజెక్టు ఇది. గతంలో 111 యులిటిటీ హెలికాప్టర్లకు ఒప్పందం కుదిరింది.