ఇవాళ అండర్‌‌‌‌19 వన్డే వరల్డ్ కప్‌‌లో బంగ్లాదేశ్‌‌తో తొలి పోరు సిద్ధమైన ఇండియా

ఇవాళ అండర్‌‌‌‌19 వన్డే వరల్డ్ కప్‌‌లో బంగ్లాదేశ్‌‌తో తొలి పోరు సిద్ధమైన ఇండియా

బ్లూమ్‌‌ఫోంటైన్ (సౌతాఫ్రికా): అండర్‌‌‌‌19 వన్డే వరల్డ్ కప్‌‌లో ఆరో కప్పుపై గురి పెట్టిన యంగ్‌‌ ఇండియా అందుకోసం తొలి అడుగు బలంగా వేయాలని చూస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో శనివారం జరిగే గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌పై ఫేవరెట్‌‌గా బరిలోకి దిగనుంది. తెలంగాణకు చెందిన వికెట్ కీపర్ అవనీశ్ రావు, మహారాష్ట్ర ఆల్‌‌రౌండర్ అర్షిన్ కులకర్ణి, లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌమి కుమార్, కెప్టెన్ ఉదయ్‌తో జట్టు బలంగా ఉంది.

ఈ టోర్నీకి సన్నాహకంగా సౌతాఫ్రికాలోనే జరిగిన ట్రై నేషన్స్ సిరీస్‌‌లో ఆడిన ఆటగాళ్లు ఇక్కడి వాతావరణం, పరిస్థితులకు అలవాటుపడ్డారు. అయితే, గత డిసెంబర్‌‌‌‌లో జరిగిన అండర్‌‌‌‌19 ఆసియా కప్‌‌ సెమీస్‌‌లో బంగ్లాదేశ్‌‌ చేతిలో ఓడిన నేపథ్యంలో ఏమాత్రం అలసత్వం చూపెట్టకుండా ఆడాల్సి ఉంటుంది. కాగా, శుక్రవారం జరిగిన గ్రూప్‌‌–బి ఆరంభ మ్యాచ్‌‌లో ఆతిథ్య సౌతాఫ్రికా 31 రన్స్‌‌ తేడాతో వెస్టిండీస్‌‌పై గెలిచి శుభారంభం చేసింది.  గ్రూప్‌‌–ఎ పోరులో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో యూఎస్‌‌ఏను ఓడించింది.