
- రష్యా డిప్యూటీ చీఫ్ బాబుష్కిన్
న్యూఢిల్లీ: 20-26 నాటికి భారత్కు మిగతా ఎస్-400 ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్స్ అందజేస్తామని రష్యా హామీ ఇచ్చింది. ఇటీవలి భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఈ సిస్టమ్స్ సత్తా చూపాయని సోమవారం ఇండియాకు వచ్చిన రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. రష్యా 20-26 నాటికి భారత్కు ఎస్–-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్కు సంబంధించి మిగతా 2 యూనిట్లను సరఫరా చేస్తుంది.
ఈ సిస్టమ్ భారత్–పాక్ మధ్య ఘర్షణ సమయంలో సమర్థంగా పనిచేసిందని బాబుష్కిన్ చెప్పారు. 2018లో భారత్ రష్యాతో ఐదు ఎస్–400 స్క్వాడ్రన్ల కోసం 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ మేరకు ఇప్పటి వరకు మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. వైమానిక రక్షణ, డ్రోన్ వ్యతిరేక సిస్టమ్స్పై భారత్తో సహకారం పెంచేందుకు రష్యా సిద్ధంగా ఉందని బాబుష్కిన్ అన్నారు. డ్రోన్ల ఎటాక్ ముప్పును ఎదుర్కొనే అనుభవం తమకు ఉందని, ఈ రంగంలో భారత్తో కలిసి పనిచేయడానికి ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు