కువైట్ సిటీ: ఇండియా యంగ్ షూటర్ రైజా ధిల్లాన్–గుర్జోత్ కంగురా జోడీ.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ షాట్ గన్ కాంపిటీషన్లో బ్రాంజ్ మెడల్తో మెరిసింది. ఆదివారం జరిగిన స్కీట్ మిక్స్డ్ టీమ్ సెకండ్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో రైజా–గుర్జోత్ 41–39తో లోకల్ ఫేవరెట్స్ అబ్దుల్లా అల్రషీద్–ఎమన్ అల్ షామాపై నెగ్గారు. 17 మందితో కూడిన క్వాలిఫికేషన్ రౌండ్లో రైజా ద్వయం 138 పాయింట్లు సాధించింది. ఓవరాల్గా ఈ టోర్నీలో ఇండియా ఒక గోల్డ్, మూడు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్తో నాలుగో ప్లేస్లో నిలిచింది.
